నిజంనిప్పులాంటిది

Mar 12 2024, 09:13

Amit Shah: నేడు బీజేపీ విజయ సంకల్ప సమ్మేళనం.. హాజరు కానున్న అమిత్ షా

Amit Shah: బీజేపీ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ రాష్ట్ర పర్యటన షెడ్యూల్ ఖరారైంది. పర్యటనలో భాగంగా ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 1:20 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు..

మధ్యాహ్నం 1:45 నుంచి 2:45 గంటల వరకు ఇంపీరియల్ గార్డెన్‌లో బీజేపీ సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో అమిత్ షా పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3:15 నుంచి 4:25 గంటల వరకు ఎల్బీ స్టేడియంలో నిర్వహించే విజయోత్సవ ర్యాలీలో పాల్గొంటారు. బీజేపీ పోలింగ్‌ బూత్‌ కమిటీల అధ్యక్షులు, మండల, జిల్లా కమిటీల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 32 వేల పోలింగ్‌ బూత్‌లు ఉన్నందున ఈ బూత్‌ కమిటీల అధ్యక్షులు, ఇన్‌ఛార్జ్‌లు, ఇతర నాయకులు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి.

అనంతరం రాష్ట్ర నేతలతో షా భేటీ కానున్నారు. సదస్సు అనంతరం ఐటీసీ కాకతీయ హోటల్‌లో సాయంత్రం 4:45 నుంచి 5:45 గంటల వరకు పార్టీ నేతలతో అమిత్ షా సమావేశం నిర్వహించి ఎన్నికల ప్రచారం, నేతల మధ్య సమన్వయం మెరుగ్గా ఉండేలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వనున్నారు. సాయంత్రం 6:10 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో తిరుగు ప్రయాణం అవుతారు..

నిజంనిప్పులాంటిది

Mar 12 2024, 07:30

నేడు కరీంనగర్లో ‘కథనభేరి’.. హాజరుకానున్న కేసీఆర్

కరీంనగర్ జిల్లా కేంద్రంలో నేడు మంగ‌ళ‌వారం బీఆర్ఎస్ ‘కథనభేరి’ సభ నిర్వహించబోతుంది.

ఈ సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కానున్నారు. ఈ సందర్భం గా మాజీ మంత్రి గంగుల కమలాకర్ సభ వివరాలను వెల్ల‌డించారు.

ఈరోజు సాయంత్రం 5:30 గంటలకి కరీంనగర్ లో కథనభేరి సభ నిర్వహిస్తు న్నట్లు పేర్కొన్నారు. ముఖ్య కార్యక్రమాలన్నీ కరీంనగర్ నుండే కేసీఆర్ ప్రారంభి స్తారు..

అదే సెంటిమెంట్ తో పార్లమెంట్ ఎన్నికల కథనభేరి కూడా కరీంనగర్ నుండే ప్రారంభం అవుతోం దని గంగుల కమలాకర్ తెలిపారు.

నిజంనిప్పులాంటిది

Mar 12 2024, 07:29

అదిలాబాద్ జిల్లాలో డీఎస్సీ,ఎస్జీటీ, అభ్యర్థులకు ఉచిత శిక్షణ శిబిరం

రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రకటించనున్న డీఎస్సీని దృష్టిలో ఉంచుకొని డీఎస్సీ, ఎస్జీటీ కోసం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిరుద్యోగ అభ్యర్థులకు ఉచిత శిక్షణను ఇవ్వనున్నట్లు జిల్లా బీసీ అభివృద్ధి అధికారి రాజలింగు, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.

బీసీ, ఎస్సీ ,ఎస్టీ, ఈబీసీ అభ్యర్థులు ఈ ఉచిత శిక్షణకు అప్లై చేసుకోవాలని కోరారు. అర్హులైన అభ్య ర్థులు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా ఈనెల 14 నుంచి 22 వరకు దరఖాస్తు చేసుకో వచ్చన్నారు.

ఈనెల 26 నుంచి శిక్షణ ప్రారంభించనున్నట్లు పేర్కొ న్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.5.00 లక్షల లోపు ఉండాలని తెలిపారు.

రిజర్వేషన్ ప్రకారం ఎస్‌జీ టీకి సంబంధించి ఇంటర్మీడి యట్, డైట్, టెట్‌లో సాధిం చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు.

ఈ ఉచిత శిక్షణ 75 రోజులు ఉంటుందని, నిపుణులైన అధ్యాపకుల చేత శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. మరిన్ని వివరాలకు 087322212809949684959 నంబర్లు సంప్రదించాలని కోరారు.

నిజంనిప్పులాంటిది

Mar 12 2024, 07:27

ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్

మార్చి 12 పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా ముస్లీం సోదరులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసం ఆదర్శ వంతమైన జీవనానికి ప్రేరణనిస్తుందని సీఎం తెలిపారు.

రంజాన్ మాస వేడుకలను సుఖ సంతోషా లతో జరుపుకోవాలని ఆయన తెలిపారు. రంజాన్ మాసంలో ముస్లిం లు కఠోర ఉపవాస దీక్షలు, ప్రార్థనలు, క్రమశిక్షణ పాటిస్తారని పేర్కొన్నారు.

రంజాన్ మాసం ఆదర్శ వంతమైన జీవనానికి ప్రేరణ ఇస్తోందన్నారు. ముస్లిం సోదరులు రంజాన్ మాసాన్ని ఆనందంతో.. సుఖసంతోషాలతో నిర్వహించుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

నిజంనిప్పులాంటిది

Mar 11 2024, 16:19

17న పల్నాడులో మోడీ టూర్..!

చారిత్రక, రాజకీయ చరిత్ర కలిగిన పల్నాడు జిల్లా కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 17 న పల్నాడు జిల్లా కు రానున్నారు.

ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద జరిగే తొలి భారీ బహిరంగ సభ లో ఆయన ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు.

ఆయనతో పాటు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు,జనసేనాని పవన్ కళ్యాణ్ ఇతర నేతలు పాల్గొననున్నారు.

2014 ఎన్నికల సమయంలో కూడా ఈ ముగ్గురు నేతలు కలిసి రాష్ట్రంలో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు.

ఆ ఎన్నికల్లో టీడీపీ,బీజేపీ లు విజయం సాధించి ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి.

అదే రాజకీయ చరిత్ర కలిగిన పల్నాడు జిల్లా కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 17 న పల్నాడు జిల్లా కు రానున్నారు.

ఈ సారి కూడా పై ముగ్గురు నేతలు రాష్ట్రంలో ప్రచారం చేసేందుకు సుడిగాలి పర్యటనలు జరిపేందుకు నిర్ణయించారు.

అందులో భాగంగానే బీజేపీ తో పొత్తు కుదిరిన వెంటనే బాబు,పవన్ లు ఏపీ నుంచే ప్రచారాన్ని ప్రారంభించాలని ప్రధాని నరేంద్ర మోడీ అంగీకరించారు.

రాజకీయ ఉద్దండులు ప్రాతినిధ్యం వహించిన పల్నాడుకు వస్తున్న ప్రధాన మంత్రుల్లో నరేంద్ర మోడీ 4వ వారు.

దేశ తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ 1955 లో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ శంఖు స్థాపన కోసం వచ్చారు.

1980 లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ మాచర్ల కేసీపీ గ్రౌండ్ లో జరిగిన సభకు హాజరయ్యారు.

1989 లో నాటి ప్రధాని రాజీవ్ గాంధీ పిడుగురాళ్ల లో జరిగిన ఎన్నికల ప్రచార సభ లో పాల్గొన్నారు.

ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 17 న రానున్నారు.

చిలకలూరిపేట సమీపంలోని బొప్పుడి వద్ద జాతీయ రహదారి పక్కనే ఉన్న 150 ఎకరాల విస్తీర్ణంలో సభ నిర్వహించాలని టీడీపీ,జనసేన నేతలు ఎంపిక చేశారు.

మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు,ఇతర నేతలు ఈ ప్రాంతాన్ని పర్యటించి పై ప్రదేశాన్ని ఎంపిక చేశారు.

సభకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఆదివారం నాడు మేదర మెట్ల లో సీఎం వైఎస్ జగన్ పాల్గొంటున్న సిద్ధం సభకు మించి మోడీ,బాబు,పవన్ పాల్గొనే సభ నిర్వహించాలని టీడీపీ, జనసేన నేతలు భావిస్తున్నారు.

అందుకు తగ్గట్టుగానే జిల్లా నేతలందరూ ఈ సభ సక్సెస్ పై దృష్టి పెట్టారు.

నిజంనిప్పులాంటిది

Mar 11 2024, 16:17

ప్రారంభమైన పవిత్ర రంజాన్ మాసం

పవిత్ర మాసం రంజాన్ ప్రారంభాన్ని సూచించే నెలవంక. సౌదీ అరేబి యాలో ఆదివారం సాయంత్రం నెలవంక కనిపించిందని సౌదీ ప్రెస్ ఏజెన్సీ నివేదించింది.

దుమ్ము, ధూళితో నిండిన వాతావరణంలో.. సౌదీ అరేబియాలోని వివిధ ప్రాంతాల్లోని ఖగోళ అబ్జర్వేటరీలు, పలు కమిటీలు నెలవంక కోసం వెతికాయి.

ఈ ఆదివారం సాయంత్రం నెలవంక కనిపించడంతో మార్చి 11 నుండి సౌదీ అరేబియాలో రంజాన్ నెల మొదలైంది.ముస్లింలు ఉపవాసాలు మొదలు పెట్టారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ), ఖతార్ కూడా సోమవారం రంజాన్ 2024 మొదటి రోజు అని ప్రకటించాయి.

ఇక భారతదేశంలో మార్చి 12 నుండి ఉపవాసాలను పాటిస్తారు.భారతదేశం, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లలో కూడా, పవిత్ర రంజాన్ మాసం మార్చి 12, మంగళ వారం నుండి ప్రారంభమవు తుంది. ఈ నెలలో, ముస్లిం లు తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకు ఉపవా సం ఉంటారు.

రంజాన్ సమయంలో ఉపవాసం ఉండటం ఇస్లాం ఐదు స్తంభాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ముస్లింలు 29 లేదా 30 ఉపవాసాలు పాటిస్తారా అనేది తిరిగి చంద్రుని దర్శనంపై ఆధారపడి ఉంటుంది.

ఇది నెల ప్రారంభం, ముగిం పును నిర్ణయించడంలో కీల కమైనది. రంజాన్ మాసం ముగిసిన తరువాత ముస్లిం లు ఈద్-ఉల్-ఫితర్ జరుపు కుంటారు...

నిజంనిప్పులాంటిది

Mar 11 2024, 16:14

నేడు యాదాద్రి, లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి దంపతులు

ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నేడు యాద‌గిరిగుట్ట‌, భ‌ద్రా ద్రిలో ప‌ర్య‌టించారు. ముం దుగా ఆయ‌న యాదాద్రిలో నేటి నుంచి ప్రారంభ‌మైన బ్ర‌హ్మోత్స‌వాల‌లో పాల్గొన్నారు..

ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు యాదగిరిగుట్ట లక్ష్మినర సింహ స్వామిని దర్శించు కున్నారు. యాదాద్రికి చేరుకున్న సీఎంకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు.

స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు, మంత్రుల బృందం పాల్గొ న్నారు.ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్శించిన రేవంత్…

వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలి రోజు ప్రభుత్వం తరుపున స్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను ముఖ్యమంత్రి రేవంత్ సమర్పించారు.

సీఎం వెంట డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. అలాగే ఎమ్మెల్యేలు బీర్ల అయిలయ్య, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, వేముల వీరేశం, బీఎల్‌ఆర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

భ‌ద్రాద్రి రామ‌య్య సేవ‌లో..

యాదాద్రి నుంచి నేరుగా హెలికాప్ట‌ర్ లో సిఎం భద్రా చలం చేరుకున్నారు. అనం త‌రం శ్రీ సీతారామచంద్ర స్వామిని రేవంత్ దంప‌తు లు దర్శించుకున్నారు.

రామాలయానికి చేరుకున్న సీఎం రేవంత్ దంపతులకు దేవస్థానం అర్చకులు, సిబ్బంది ఆలయ మర్యాద లతో స్వాగతం పలికారు. అనంతరం సీతారామచంద్ర స్వామి వారిని ముఖ్య మంత్రి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

ఉపాలయం లక్ష్మీ తాయారు అమ్మ వారి ఆలయంలో రేవంత్ దంపతులకు వేద ఆశీర్వాదం అందించారు. ముఖ్యమంత్రి వెంట డిప్యూ టీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల పొంగులేటి, కొండా సురేఖ, సీతక్క ఉన్నారు...

నిజంనిప్పులాంటిది

Mar 06 2024, 07:52

ఇందిరమ్మ ఇళ్లకు 3 వేల కోట్లు మంజూరు చేసిన రేవంత్ సర్కార్

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకానికి హడ్కో రూ.3 వేల కోట్ల రుణాన్ని మంజూరు చేసేందుకు సమ్మతించింది.

ఈ మేరకు రుణం పొందేం దుకు స్టేట్ హౌజింగ్ బోర్డుకు ప్రభుత్వం అనుమతిని తెలిపింది. ఇందులో భాగంగా 95,235 ఇందిరమ్మ ఇళ్లకు గాను హడ్కో రూ.3 వేల కోట్ల రుణాన్ని సాంక్షన్ చేయనుంది.

గ్రామాల్లో 57,141 ఇళ్లు పట్టణాల్లో 38,094 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణా లకు ఆ రుణాలను స్టేట్ హౌజింగ్ బోర్డు వినియోగ నించనుంది.

Streetbuzz News

నిజంనిప్పులాంటిది

Mar 03 2024, 09:18

High Temperature: రాష్ట్రంలో భానుడి ప్రతాపం.. రానున్న 5 రోజులు పెరగనున్న ఉష్ణోగ్రతలు..

తెలంగాణ రాష్టంలో వేసవి ప్రారంభం కాకముందే.. ఎండలు మండిపోతున్నాయి. మార్చి మొదటి వారంలో వేడి విపరీతంగా పెరిగింది.

రాష్ట్రంలోని సగం జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్‌ను దాటుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Streetbuzz News

నిజంనిప్పులాంటిది

Mar 03 2024, 09:13

తెలంగాణలో 45 మంది డిఎస్పీ ల బదిలీలు

రాష్ట్రంలో పనిచేస్తున్న 45 మంది డిఎస్పీ లను బదిలీ చేస్తూ డిజిపి రవిగుప్త శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఒకే పార్లమెంటు పరిధిలో గత నాలుగేళ్లలో మూడు సంవత్సరాల పాటు పని చేసిన వారిని బదిలీ చేయాలని ఎన్నికల సంఘం ఉత్తర్వుల మేరకు పెద్ద ఎత్తున బదిలీలను చేపట్టారు.

ఇటీవల ఐపీఎస్ అధి కారుల బదిలీలు చేపట్టిన ప్రభుత్వం ఈరోజు డీఎస్పీ లను బదిలీ చేశారు.